కరోనా సమయంలో అష్టకష్టాలు పడిన మందుబాబులకు గుడ్న్యూస్.. లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. దీంతో.. లాక్డౌన్కు ముందు ఉన్న టైమింగ్లో లిక్కర్ అమ్మకాలు కొనసాగనున్నాయి.. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలు కొనసాగనున్నాయి. మద్యం దుకాణాలపై ఆంక్షలు ఎత్తివేస్తూ రాష్ట్ర ఆబ్కారీ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
కరోనా లాక్డౌన్ తర్వాత మే 6వ తేదీ నుంచి మద్యం అమ్మకాలు తిరిగి ప్రారంభించారు.. అయితే.. నిబంధనల ప్రకారం.. మొదట. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మద్యం షాపులకు అనుమతి ఇచ్చారు..

