Dailyhunt
ఒకే మండపంలో ఇద్దరికి తాళికట్టిన యువకుడు..!

ఒకే మండపంలో ఇద్దరికి తాళికట్టిన యువకుడు..!

NTV Telugu 5 years ago

ఓ యువకుడు ఒకే మండపంలో ఇద్దరు అమ్మాయిలకు తాళి కట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలోని కెరియా గ్రామానికి చెందిన సందీప్ అనే యువకుడు తాను చదువుకుంటున్న సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమెనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ అమ్మాయి కూడా అతడిని విడిచి బ్రతకలేనంతగా ప్రేమించింది. కాగా ఇటీవల అతడి ప్రేమ వ్యవహారం తెలియని కుటుంబ సభ్యులు సందీప్ కు సంబంధం చూడటం మొదలు పెట్టారు. వారి బంధువుల్లో ఒక అమ్మాయిని అతడికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. దాంతో కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయి కూడా సందీప్ పై మనసు పారేసుకుంది. తానే జీవితం అనుకుంది.

ఇక తనకు సంబంధం చూసిన విషయం సందీప్ కు తెలియటంతో అతడు ఒక అమ్మయిని ప్రేమిస్తున్నాని చెప్పి కుటుంబ సభ్యులు చూసిన సంబంధానికి నిరాకరించాడు. ఇక ఈ విషయం ఊర్లో పంచాయితీకి వెళ్లటంతో అక్కడ ఇద్దరు అమ్మాయిలు అతడినే పెళ్లి చేసుకుంటామని చెప్పారు. యువకుడు కూడా దానికి అంగీకరించాడు. దాంతో ఒకే మండపంలో ఇద్దరికి తాళికట్టాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu