Dailyhunt
ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతులపై హైకోర్టు విచారణ...

ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతులపై హైకోర్టు విచారణ...

NTV Telugu 5 years ago

ఆన్ లైన్ తరగతులపై కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుందని తెలిపిన ప్రభుత్వం ఈ నెల 31వరకు విద్యా సంస్థలు తెరవద్దని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలిపింది. ఈ నెల తర్వాతే విద్యా సంవత్సరం పై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పిన ప్రభుత్వం విద్యా సంవత్సరం మొదలు కాక ముందే ఆన్ లైన్ తరగతులను ఎలా అనుమతిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఆన్ లైన్ తరగతులకు అనుమతి ఇవ్వనట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఓవైపు అనుమతి ఇవ్వలేదంటునే .. మరోవైపు అడ్డుకోవడం లేదని ప్రభుత్వం ధ్వంద్వ వైఖరి తో దాగుడు మూతలు ఆడకూడదని, మహారాష్ట్ర మాదిరిగా స్పష్టమైన నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

అయితే తరగతులు జరగకపోతే విద్యార్థుల కెరీర్ స్థంభించిపోతుంది అని తెలిపిన విద్యా సంస్థల న్యాయవాది వారి కెరీర్ కోసం నెల రోజులుగా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అయితే ఆన్ లైన్ తరగతుల కోసం ఒక్కో ఇంట్లో రెండు మూడు ల్యాప్ టాప్ లు కొనే పరిస్థితి ఉందా అని ప్రశ్నించిన హైకోర్టు ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం కాదు గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నీ తెలిపింది. కరోనా కారణంగా కార్మికులు, న్యాయవ్యవస్థ తో పాటు ప్రపంచ మానవాళి జీవితమే స్తంభించింది అని తెలిపిన హైకోర్టుకేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ, ఎన్సిటీఈని ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది . ఇక కేంద్రం, సీబీఎస్ ఈ వాదనలు కూడా వింటామన్న హైకోర్టు తదుపరి విచారణ ఈనెల 13కి వాయిదా వేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu