భారతీయ జనతా పార్టీ నాయకురాలు విజయశాంతి అలియాస్ రాములమ్మ.. జీహెచ్ఎంసీ మహిళా పారిశుద్ధ్య కార్మికుల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది... అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు విజయశాంతి.. మహిళలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో చేస్తోందని గుర్తుచేసిన ఆమె.. ఎక్కడ మంచి జరిగినా అక్కడ బీజేపీ ఉంటుందన్నారు.. సమాజంలో చెడుని కూడా క్లీన్ చేయాలంటూ పారిశుద్ధ్య కార్మికుల నుద్దేశించి మాట్లాడిన ఆమె.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు మేలు జరగదని.. బీజేపీ వస్తేనే మేలు జరుగుతుందన్నారు.

