అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ''నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు'' అంటూ వ్యాఖ్యానించారు.
ఇప్పుడీ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ''నెతన్యాహు చాలా మంచి వ్యక్తి. నేను కోరుకున్నది ఏదైనా సరే.. ఆయన చేస్తారు. చాలా మంచి మనిషి. నేను ఏం చెప్పినా అదే చేస్తారు. నా మాట వింటారు'' అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇజ్రాయెల్లో నెతన్యాహుకు సరైన గౌరవం దక్కడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ''నా అభిప్రాయం ప్రకారం ఇజ్రాయెల్లో ఆయనకు సరైన గౌరవం దక్కడం లేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రజల్లో నాకు 99 శాతం మద్దతు ఉంది. నేను అక్కడ ప్రధాని పదవికి పోటీ చేసినా గెలిచే పరిస్థితి ఉంది.'' అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముఖ్యంగా అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్-నెతన్యాహు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. ఇప్పుడు చేసిన ఈ కామెంట్స్ మరింత హాట్ టాపిక్గా మారాయి.

