కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తాజా చిత్రం ‘వాలిమై’ వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇటీవలే దీని ప్రమోషన్ యాక్టివిటీస్ ను మొదలు పెట్టారు.
అయితే తాజాగా అజిత్ వరల్డ్ టూర్ కు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో అతను మరల్ ను మరోసారి కలిసినట్టు తెలుస్తోంది. ఈసారి ఈ విషయాన్ని మరల్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అజిత్ ఎంత పేరున్న నటుడో అతన్ని కలిసే సమయానికి తనకు తెలియదని, తాము కలుసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విధానం చూసి ఆశ్చర్యపోయానని చెప్పింది. ఓ నటుడిగా కాకుండా అజిత్ వ్యక్తిగా తనకెంతో నచ్చాడని తెలిపింది. పేరున్న ఫిల్మ్ స్టార్ అయి ఉండి కూడా అజిత్ ఎంతో హుందాగా, గౌరవంగా, అతి సాధారణ వ్యక్తిలా తనతో మాట్లాడారని, ఆయనలోని ఆ స్వభావం తనకెంతో నచ్చిందని మరల్ చెప్పింది. సోషల్ మీడియాకు దూరంగా ఉండే అజిత్ ప్రైవసీని కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉందని చెబుతూ, ఆయన అనుమతితోనే అతనితో తాను దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టు మరల్ పేర్కొంది. ఇప్పుడీ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

