స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయికి వెళ్లేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తన తాజా సినిమా పుష్పతో పాన్ ఇండియా రేంజ్లో మార్కెట్ పెంచుకునేందుకు అర్జున్ ప్లాన్ చేశారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మరో రెండు సినిమాలను ఫైనల్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో ఒకటి, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరొకటి. వీటిలో ముందుగా కొరటాల శివ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు కావాలసిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో అంటే దాదాపు మార్చి31న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట.

