West Bengal Results: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడేసింది. మొత్తం 294 నియోజకవర్గాలకు గానూ 293 స్థానాలకు ఈ రోజు ఓట్ల లెక్కింపు జరిగింది.
బీజేపీ ఏకంగా 190కి పైగా స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇక తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) 100 లోపు స్థానాలకే పరిమితమైంది. మంత్రులతో సహా కీలక టీఎంసీ నేతలు ఓటమి అంచుల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ గెలుపుతో ప్రధాన పాత్ర పోషించి ''ఝాల్మురి''ని తింటూ నేతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్పష్టమైన తర్వాత బీజేపీ కార్యకర్తలు మమతా బెనర్జీ ఇంటి ముందు విజయోత్సవాలు చేశారు. ''జైశ్రీరాం'' నినాదాలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ''జైశ్రీరాం'' నినాదంతో, టీఎంసీ ''జై బంగ్లా'' నినాదంతో ప్రచారాన్ని నిర్వహించాయి.

