Debate on Operation Sindoor : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆపరేషన్ సిందూర్ పై చర్చ లోక్ సభలో ముగిసింది.
రాజ్యసభలోనూ ఈరోజు ముగుస్తోంది. లోక్ సభలో జరిగింది చూసిన తర్వాత.. ఇందుకోసమే కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టిందా? అన్న చర్చ మొదలైంది.
అసలు ఆ చర్చ లో కొత్త విషయాలు అడిగింది లేవు. ఇవన్నీ టీవీల్లో నలుగుతున్న ప్రశ్నలే. ఆల్ రెడీ ప్రభుత్వం, ఆర్మీ చెప్పి ఉంది. కాంగ్రెస్ ప్రశ్నల్లో హుందాతనం లేదు. మోడీ, అమిత్ షాలు దాన్ని అద్భుతంగా కన్వర్ట్ చేసి జనాల్లోకి పంపించి కాంగ్రెస్ ఎండగట్టింది.
ఈ అద్భుత అవకాశాన్ని కాంగ్రెస్ వినియోగించలేదు. ఆపరేషన్ సిందూర్ లో ప్రభుత్వం పాత్ర తప్ప కాంగ్రెస్ ది ఉండదు. భారత్ తరుఫున ఇతర దేశాలకు వెళ్లి మాట్లాడిన వ్యక్తులు మనిష్ తివారీ, సల్మాన్ ఖుర్జీద్, శశిథరూర్ లు. భారత్ తరుఫున రిప్రజెంటీటివ్ చేశారు. ఆయనతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ కు మైలేజ్ వస్తుంది.
ఆపరేషన్ సిందూర్ పై చర్చలో కాంగ్రెస్ కు వ్యూహమేది? అన్న దానిపై 'రామ్' గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com