BJP MLA Dipesh Sahu marriage: చమురు ధరలు బీభత్సంగా ఉన్నాయి. నిత్యావసరాల ధరలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో సగటు మనిషి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్ పెండేంచర్ విపరీతంగా ఉంటున్నది.
ధరలు ఈస్థాయిలో ఉండటంతో ఎలా బతకాలి? ఈ ఖర్చులను అధిమించాలో తెలియక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే అరుణాచల్ ప్రదేశ్ వరకు మొత్తం ఇదే పరిస్థితి. ధరల మీద మన్నువడ.. ఇదేం ఇబ్బంది రా నాయనా అని పాడుకునే దుస్థితి.
పెరిగిన ధరలు సామాన్యులను మాత్రమే కాదు.. రాజకీయ నాయకులను సైతం ఇబ్బంది పెడుతున్నాయి. అలాంటి ఖర్చు ఇబ్బందిని జయించేందుకు ఒక ఎమ్మెల్యే చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులు ఖర్చు తగ్గించుకోవాలని.. కాన్వాయ్ లో ఉన్న వాహనాలను తగ్గించాలని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆ పిలుపును అందుకొని చత్తీస్గడ్ ప్రాంతానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే దీపేష్ సాహు తన పెళ్లి విషయంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు దేశాంతంగా ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలిచారు.
దీపేష్ “ముఖ్యమంత్రి కన్య వివాహ యోజన” అనే పథకం ప్రారంభంలో పాల్గొన్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం సామూహికంగా వివాహాలు జరపడం.. అయితే దీపేష్ ఒక డ్రైవర్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు వివాహ వేదిక వద్దకు ఆయన ఎద్దుల బండిమీద వచ్చారు. ఎద్దుల బండిని ఉప ముఖ్యమంత్రి సావ్ స్వయంగా నడుపుకుంటూ తీసుకొచ్చారు. ఎటువంటి హంగు కనిపించలేదు. ఆర్భాటం కూడా దర్శనమివ్వలేదు. అనవసరమైన ఖర్చు లేకుండా ఎమ్మెల్యే అత్యంత సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తన సతీమణితో అదే ఎద్దుల బండి మీద కలిసి ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి ఆ ఎద్దుల బండిని ముందుండి నడిపారు.
ఎద్దుల బండిమీద ఎమ్మెల్యే రావడం.. ఉప ముఖ్యమంత్రి దాన్ని నడపడం సంచలనంగా మారింది. ప్రజా ప్రతినిధులు ఎక్కడికైనా వెళ్తే ప్రోటోకాల్ వాహనాలతో సందడి చేస్తారు. కానీ ఎమ్మెల్యే హోదాలో ఉండి ఆయన ఆ వాహనాలను వాడుకోలేదు. ఉప ముఖ్యమంత్రి తన స్థాయిని పక్కనపెట్టి ఎడ్ల బండి నడిపారు. దీని వెనుక పిఆర్ స్టంట్.. ఇంకా ఏదైనా ఉన్నప్పటికీ.. ప్రజల్లో మాత్రం ఇటువంటి వ్యవహారాలు చాలా బలమైన ముద్రవేస్తాయి.

