Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్ లో చిక్కులు లేకుండా స్థలం  కొనుక్కుని.. సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్నారా..

హైదరాబాద్ లో చిక్కులు లేకుండా స్థలం కొనుక్కుని.. సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్నారా..

Oktelugu.com 2 days ago

Hyderabad Commercial Real Estate Growth: పైసా పైసా కూడబెట్టుకుని.. స్థలం కొనుక్కుంటాం. హైదరాబాద్ నగరంలో ఇల్లు కూడా కట్టకుంటున్నామని బంధువులతో గొప్పగా చెప్పుకుంటాం.

కానీ ఆ స్థలం అమ్మిన వ్యక్తి మోసం చేస్తాడు. ఆ స్థలాన్ని గతంలోనే మరో వ్యక్తికి అమ్మి.. డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఇక అక్కడి నుంచి మన ఇబ్బందులు మొదలవుతాయి. పోలీస్ స్టేషన్ల కు వెళ్లాలి. లాయర్లను కలవాలి. ఏన్నో ఏళ్లకు గాని ఆ కేసు పరిష్కారం కాదు. ఈలోగా ఇల్లు కట్టుకోవాలనే మన కల కలగానే మిగిలిపోతుంది.

ఇలాంటి ఇబ్బందులు హైదరాబాద్ నగరంలో చాలా మంది అనుభవించి ఉంటారు. అయితే అలాంటి వాళ్ల కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు బంగారం లాటి అవకాశాన్ని తీసుకొచ్చింది. వివాదాలు లేకుండా, స్పష్టంగా యాజమాన్య హక్కులు వచ్చేలా ప్రభుత్వ భూములను విక్రయించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, మాల్కాజ్ గిరి జిల్లాలలో అత్యంత ఖరీదుగా ఉండే ప్రాంతాలలో ఎనిమిది భారీ ప్లాట్లు, ల్యాండ్ పార్సిళ్లను ఈ వేలం విధానంలో అమ్మనుంది. కేపీహెచ్ బీ కాలనీ, కుత్బుల్లాపూర్ పరిధిలో ఉన్న చింతల్, శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న రావిర్యాల వంటి ఏరియాలలో ఈ భూములను అమ్మనుంది.

ఈనెల 28న ఈ భూములను విక్రయిస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్లు ఇక్కడ ఇళ్లు నిర్మించుకోవచ్చు. కార్పొరేట్ సంస్థలు విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. బహుళ వాణిజ్య సముదాయాలు నిర్మించవచ్చు. వేలం విధానంలో కనిష్టంగా 1116 చదరపు గజాల నుంచి 13504 చదరపు గజాల వరకు స్థలాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. చదరపు గజం కనీస ధర 26 వేలుగా ఉంది. గరిష్టంగా లక్ష రూపాయలు. ఇప్పటికే నాంపల్లి ప్రాంతంలో ప్రీ బిడ్ డిపాజిట్ నిర్వహించారు. ప్రీ బిడ్ డిపాజిట్ ప్రాంతాల ఆధారంగా రూ.25 లక్షల నుంచి కోటి వరకు ఉంది. మే 27న సాయంత్రం ఐదు గంటల వరకు ప్రి బిడ్ డిపాజిట్ చెల్లించేందుకు అవకాశం ఉంది. రావిర్యాల ప్రాంతంలో 28న, కేపీహెచ్ బీ, చింతల్ ఏరియాలలో 29న ఈ వేలం నిర్వహిస్తారు.

రావిర్యాల ప్రాంతంలో ప్లాట్ నంబర్ 1 నుంచి నాలుగు వరకు విస్తీర్ణం 1116 నుంచి 13504 చదరపు గజాల వరకు 26 వేల నుంచి 49 వేల వరకు ధర నిర్ణయించారు.

కేపీహెచ్ బీ కాలనీ, చింతల్లో ఫేజ్ 1,2 ప్లాట్లు ల్యాండ్ పార్సిల్ 1, 2, కోసం 2,420, 5,898,10,890,3,388 చదరపు గజాలకు రూ, 90 వేలు, రూ.70 వేలు, రూ. 40 వేలుగా ధరను నిర్ణయించారు.
image.png

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com