Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కరీంనగర్‌ దోపిడీ కేసు.. పోలీసుల చేతిలో  161 తులాలు

కరీంనగర్‌ దోపిడీ కేసు.. పోలీసుల చేతిలో 161 తులాలు

Oktelugu.com 1 week ago

Karimnagar robbery case latest news: తెలంగాణలో ఇటీవల సంచలనం సృష్టించిన కరీంనగర్‌ పీఎంసే జ్యువెల్లరీలో దోపిడీ ఘటనలో పోలీసులు రోజుకో పురోగతి సాధిస్తున్నారు.

ఘటన జరిగి పది రోజులు దాటింది. ఇప్పటి వరకు ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. బిహార్, బెంగాల్‌లో వీరిని అరెస్టు చేశారు. వీటి నుంచి 161 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. మాస్టర్‌ మైండ్‌ సుబోద్‌ సింగ్‌తో పాటు మరో 10 మంది పరారీలో ఉన్నారు.

ఏం జరిగిందంటే..
కరీంనగర్‌ పీఎంజీ జ్యువెలరీ దుకాణంపై గ్యాంగ్‌ దాడి చేసి 161 తులాల బంగారాన్ని దోచుకుంది. ఈ దోపిడీ రాష్ట్రవ్యాప్త కలకలం రేపింది. పోలీసులు బిహార్, పశ్చిమ బెంగాల్‌లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దోచిన మొత్తం బంగారాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

మాస్టర్‌ మైండ్‌ సుబోద్‌ సింగ్‌..
బిహార్‌కు చెందిన సుబోద్‌ సింగ్‌ ఈ దోపిడీకి ప్రధాన కుట్రదారుడు. 'ది గోల్డెన్‌ థీఫ్‌' అనే బిరుదు పొందిన అతను గతంలో కూడా బంగారు దోపిడీలకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొంటున్నారు. అతడితోపాటు మరో 10 మంది బిహార్, ఇతర రాష్ట్రాలకు చెందినవారు పరారీలో ఉన్నారు. వారి మీద ఇప్పటికే లుక్‌ఔట్‌ నోటీజులు జారీ అయ్యాయి.

పోలీసు చర్యలు
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, మొబైల్‌ ట్రాకింగ్, ఇంటర్‌స్టేట్‌ ఇంటెలిజెన్స్‌తో వేగంగా చర్య తీసుకున్నారు. బంగారం రికవరీ దుకాణానికి భారీ ఆర్థిక లాభం. ప్రస్తుత ధరల్లో దాదాపు 1012 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. ముగ్గురు అరెస్టులతో కేసు 30 శాతం పూర్తయిందని అధికారులు తెలిపారు.

ఈ దోపిడీలు అంతర్రాష్ట్ర ముఠాల దూకుడును తెలియజేస్తున్నాయి. బంగార ధరలు భారీగా పెరగడంతో ఇలాంటి దోపిడీలు పెరుగుతున్నాయి. దొంగలను పట్టుకోవడంతో తెలంగాణ పోలీసులు ఈ విజయంతో ప్రశంసలు అందుకున్నారు, కానీ మిగిలిన పరారీదారులు పట్టుబడే వరకు జాగ్రతలు తప్పవు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com