Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మన భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందడం లేదు..

మన భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందడం లేదు..

Oktelugu.com 3 hrs ago

India development growth: భారతదేశంను ఇప్పటికీ కొందరు అభివృద్ధి చెందుతున్న దేశం అని అంటూ ఉంటారు. కానీ 77 సంవత్సరాలైనా కూడా ఈదేశంల అభివృద్ధి చెందిన దేశంగానే పిలవబడుతోంది.

ఇందుకు కారణం ఇక్కడ సరైన ఆర్థిక వనరులు లేకపోవడమా? లేదా నైపుణ్యం లేకపోవడమా? అన్న చర్చ పదే పదే జరుగుతుంది. కానీ నేటి యువతకు కావాల్సిన మార్గాలు, సౌకర్యాలు, వారికి అవగాహన కల్పించడానికి స్కిల్స్ లేకపోవడమేనని అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు తామ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తామని చెబుతారు. కానీ ప్రైవేట్ కంపెనీ పెట్టుకుంటామంటే మాత్రం అనుమతి ఇవ్వరు. ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేట్ సెక్టార్ పెరగడంతోనే దేశం అభివృద్ధి జరుగుతుందని కొందరి ఆర్థిక నిపుణుల సలహా. అసలు నేటి యువత చదువు పూర్తయ్యాక ఏ దారిలో వెళ్లాలి? ప్రభుత్వ ఉద్యోగం కోసం సంవత్సరాల పాటు సిద్ధం కావాలా? ప్రైవేట్ రంగంలో వెంటనే ఉద్యోగం పట్టాలా? లేక రిస్క్ తీసుకుని వ్యాపారం ప్రారంభించాలా? ఈ మూడు మార్గాల్లో ప్రతి దానికి అవకాశాలున్నాయి.. అలాగే సమస్యలూ ఉన్నాయి. కానీ దేశ ఆర్థిక పరిస్థితులు, విద్యా వ్యవస్థ, టెక్నాలజీ మార్పులు, ప్రపంచ పోటీ కారణంగా యువతలో గందరగోళం పెరుగుతోంది. వీటి గురించి..

ప్రభుత్వ ఉద్యోగం ఇంకా ఎందుకు ఆకర్షిస్తోంది?
భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇప్పటికీ 'భద్రత' అనే భావన బలంగా ఉంది. ఒకసారి ఉద్యోగం వస్తే స్థిరమైన జీతం, పెన్షన్ ప్రయోజనాలు, సామాజిక గౌరవం, ఉద్యోగ భద్రత లభిస్తాయని చాలా కుటుంబాలు నమ్ముతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని జీవిత లక్ష్యంగా చూస్తున్నారు.

అయితే సమస్య ఏంటంటే.. పోస్టులు చాలా తక్కువ, పోటీ లక్షల్లో ఉంటుంది. ఒక ఉద్యోగానికి వేల మంది దరఖాస్తు చేయడం సాధారణమైపోయింది. కొందరు యువకులు 5-6 సంవత్సరాలు కేవలం పరీక్షల కోసమే సిద్ధమవుతూ జీవితంలోని కీలక సమయాన్ని ఖర్చు చేస్తున్నారు. ఉద్యోగం వస్తే మంచిదే కానీ రాకపోతే మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి.

ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా కూడా ఆ ఉద్యోగికి ప్రతీ సంవత్సరం ఇంక్రిమెంట్ పెరుగుతుంది. ఆ పరిస్థితి లేకపోతే ఇతర మార్గాల్లో ఆదాయం ఆర్జించాలని చూస్తుంటారు. ఇలా కొంత వరకు మాత్రమే సంపద సృష్టించబడుతుందని కొందరు ఆర్థిక వేత్తలు అంటున్నారు.

ప్రైవేట్ సెక్టార్‌లో అవకాశాలు ఎక్కువ.. కానీ ఒత్తిడి కూడా ఎక్కువే ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ రంగంతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఈ-కామర్స్, డిజిటల్ మార్కెటింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో ఉద్యోగాలు వేగంగా పెరిగాయి.

కానీ ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థిరత్వం తక్కువగా ఉంటుంది. కంపెనీ పరిస్థితులు మారితే ఉద్యోగాలు పోవచ్చు. టార్గెట్లు, పనిఒత్తిడి, ఎక్కువ పని గంటలు ఉద్యోగులను మానసికంగా అలసటకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో "లేఆఫ్స్" అనే భయం ఎప్పుడూ ఉంటుంది.

అయినా సరే.. ప్రైవేట్ రంగం ఒక మంచి విషయం నేర్పుతోంది. అది "స్కిల్స్". ఎవరి దగ్గర నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయో వారికి మంచి జీతాలు, ప్రపంచస్థాయి అవకాశాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఒక వ్యక్తి కొన్నాళ్ల పాటు ఒక కంపెనీలో ఉద్యోగం చేసి.. ఆ తరువాతం సొంతంగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రారంభించవచ్చు. దీంతో తన ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆ తరువాత విదేశాలతో కూడా వ్యాపారం చేయొచ్చు. కానీ చాలా మంది ప్రైవేట్ జాబ్ అనగానే భయంతో వీటి వైపు వెళ్లడం లేదు. దీంతో భారతదేశంలో సంపద సృష్టించబడడం లేదు.

ఐటీ చదివిన వారికి సరైన ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు?
ప్రస్తుతం దేశంలో పెద్ద చర్చగా మారింది. ప్రతి సంవత్సరం లక్షల మంది ఇంజినీరింగ్, ఐటీ కోర్సులు పూర్తి చేస్తున్నా.. అందరికీ సరైన ఉద్యోగాలు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం "స్కిల్ గ్యాప్".

చాలా కాలేజీల్లో ఇప్పటికీ పాత సిలబస్ నే బోధిస్తున్నారు. పరిశ్రమలకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలు విద్యార్థుల్లో తక్కువగా ఉన్నాయి. చాలామంది విద్యార్థులు కేవలం డిగ్రీ కోసం మాత్రమే చదువుతున్నారు కానీ రియల్ ప్రాజెక్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్‌పై దృష్టి పెట్టడం లేదు.

ఇక మరోవైపు కంపెనీలు ఇప్పుడు కేవలం డిగ్రీ కాకుండా AI, Cloud Computing, Cyber Security, Data Analytics, Full Stack Development వంటి ఆధునిక నైపుణ్యాలు కోరుతున్నాయి. అందుకే 'చదువు ఉంది.. ఉద్యోగం లేదు' అనే పరిస్థితి కనిపిస్తోంది.

AI రావడంతో ఉద్యోగాల భవిష్యత్తు ఎలా మారుతోంది?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగం వేగంగా మారుతోంది. ఒకప్పుడు మనుషులు చేసే అనేక పనులను ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లు, ఆటోమేషన్ టూల్స్ చేస్తున్నాయి. దీనివల్ల కొంతమంది ఉద్యోగాలు కోల్పోతున్నా.. కొత్త ఉద్యోగాలు కూడా పుడుతున్నాయి.భవిష్యత్తులో కేవలం డిగ్రీ సరిపోదు. జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యం ఉన్నవారే నిలబడగలుగుతారు. 'లెర్నింగ్' ఒక నిరంతర ప్రక్రియగా మారుతోంది.

వ్యాపారం ప్రారంభించాలంటే ఎందుకు భయపడుతున్నారు?
భారతదేశంలో చాలా మంది యువతకు వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉంది. కానీ మొదటి అడుగు వేయడానికే భయపడుతున్నారు. ఎందుకంటే వ్యాపారం అంటే రిస్క్, పెట్టుబడి, అనిశ్చితి.మొదటగా మూలధనం సమస్య ఉంటుంది. బ్యాంకులు కొత్త వ్యాపారాలకు సులభంగా రుణాలు ఇవ్వవు. కుటుంబాలు కూడా "స్థిరమైన ఉద్యోగం వదిలి వ్యాపారం ఎందుకు?" అని ప్రశ్నిస్తాయి. మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉంటుంది. టాక్సులు, లైసెన్సులు, అనుమతులు, అధికార వ్యవస్థలో ఆలస్యం వంటి సమస్యలు కొత్త వ్యాపారులకు అడ్డంకులవుతున్నాయి. వీటిలో

1. నాణ్యమైన విద్య లోపం: చాలా మంది విద్యార్థులు డిగ్రీలు సంపాదిస్తున్నా.. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అందడం లేదు.

2. జనాభా ఒత్తిడి: భారతదేశంలో యువత సంఖ్య చాలా ఎక్కువ. కానీ అందరికీ సరిపడా ఉద్యోగాలు సృష్టించడం పెద్ద సవాలుగా మారింది.

3. పరిశోధనలపై తక్కువ పెట్టుబడి: అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే పరిశోధన, టెక్నాలజీ అభివృద్ధిపై భారత్ తక్కువగా ఖర్చు చేస్తోంది.

4. బ్యూరోక్రసీ, అవినీతి: కొన్ని రంగాల్లో అనుమతులు, విధానాలు, ఆలస్యాలు వ్యాపారాల వృద్ధిని మందగింపజేస్తున్నాయి.

5. గ్రామీణ-పట్టణ అసమానతలు: పట్టణాల్లో అవకాశాలు ఎక్కువగా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి.

ఇలా అనేక సమస్యలు ఉండడంతోనే భారతదేశంలో ఇంకా అభివృద్ధి చెందుతున్నదేశంగానే ఉండిపోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com