Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాకిస్తానీలను తన్ని తరిమేస్తున్న  యూఏఈ.. అసలు కారణమేంటంటే

పాకిస్తానీలను తన్ని తరిమేస్తున్న యూఏఈ.. అసలు కారణమేంటంటే

Oktelugu.com 1 week ago

UAE Deporting Pakistanis: ముస్లింలు అంతా ఒకటే అని మనం అనుకుంటూ ఉంటాం. వారి మధ్య ఐకమత్యం అద్భుతంగా ఉంటుందని భావిస్తుంటాం. కానీ అదంతా అబద్ధమని..

వారి మధ్య కూడా జాతులు.. కులాలు.. తెగలు వంటి సమస్యలు ఉన్నాయని తాజా ఘటన ద్వారా బయటపడింది. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ ప్రజలను బయటికి వెళ్లగొడుతుంటే ఆ దేశ పరిపాలకులు కనీసం నోరు కూడా మెదపడం లేదు. ఒక దేశానికి సంబంధించి ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు.

పాకిస్తాన్ దేశస్థులు ప్రస్తుతం యూఏఈ ప్రభుత్వం చేతిలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. యూఏఈ దేశంలో ఉంటున్న పాకిస్తాన్ ప్రజలను అక్కడి ప్రభుత్వం మొహమాటం లేకుండా బయటకు వెళ్లగొడుతోంది. యుద్ధ ఖైదీలకు వేసినట్టు చేతులకు సంకెళ్లు వేసి బయటకు పంపిస్తోంది. ఇంకోసారి మా దేశంలోకి వస్తే మామూలుగా ఉండదంటూ హెచ్చరిస్తోంది. దీంతో పాకిస్తాన్ ప్రజలు అపరాధ భావంతో తలవంచుకొని.. యుద్ధ ఖైదీల మాదిరిగా దేశానికి తిరిగి వస్తున్నారు.

యూఏఈ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. యూఏఈ అమెరికా బలగాలకు.. యుద్ధ క్షేత్రాల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ఈ సమాచారం మొత్తం బయటపడకుండా జాగ్రత్త పడింది. యూఏఈ దేశంలో ఉన్న షియా ముస్లింలు ఈ సమాచారాన్ని ఇరాన్ దేశానికి అందించినట్టు తెలుస్తోంది. అందువల్ల ఇరాన్ యూఏఈ, ఖతార్, కువైట్ దేశాల మీద దారుణంగా దాడులు చేసింది. పెద్దపెద్ద ఆయిల్ రిఫైనరీలు.. ఇతరత్రా మౌలిక ప్రాజెక్టుల మీద కనీ విని ఎరగని స్థాయిలో దాడులు చేసింది. ఈ దాడుల వల్ల ఆ దేశాలు విపరీతంగా నష్టపోయాయి. ఈ నష్టాన్ని పూడ్చుకోవాలి అంటే ఆ దేశాలకు దాదాపు దశాబ్దాల సమయం పడుతుంది. అనేక రకాలుగా కష్టానికి ఓర్చుకొని.. ప్రయాసలు పడి అటువంటి వ్యవస్థలను నిర్మిస్తే.. చివరికి ఇరాన్ దాడులు చేయడంతో పరిస్థితి దారుణంగా మారిపోయింది.

ఇదంతా కూడా పాకిస్తాన్ దేశానికి సంబంధించిన షియా ముస్లింల పని అని యూఏఈ అంతర్గత విచారణలో తేలింది. దీంతో అక్కడి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది. పాకిస్తాన్ దేశానికి సంబంధించిన షియా ముస్లింలను తన్ని తరిమేస్తోంది. ఇప్పటికే 15,000 మందిని వారి వారి దేశాలకు పంపించింది. కేవలం పాకిస్తాన్ దేశస్తులను మాత్రమే కాకుండా.. ఇతర దేశాలకు సంబంధించిన షియా ముస్లింలను కూడా బయటికి పంపిస్తోంది. వీరి తర్వాత సున్నీలను కూడా దేశం దాటి పంపించే దిశగా యూఏఈ ప్రణాళికలు రూపొందించింది. అయితే ఈ స్థాయిలో తమ దేశస్తులను పంపిస్తున్నప్పటికీ పాకిస్తాన్ పరిపాలకులు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com