రాజకీయం
BREAKING NEWS : మీ పై కేసిఆర్ చూపు.. కేటీఆర్ వివరణ..!

ఆర్యవైశ్యులు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. పార్టీలో వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని.. సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. పీపుల్స్ ప్లాజాలో ఆర్యవైశ్య ఆత్మీయ అభినందన సభలో మంత్రి పాల్గొన్నారు.
కుల, మతాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లాగా సీఎం ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. రాష్ట్రాన్ని ఎవరు ప్రగతి పథంలోముందుకు తీసుకెళ్తున్నారో ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర రాబడి పెరిగినప్పుడే పేదల సంక్షేమం సాధ్యమన్న కేటీఆర్.. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెరగాలన్న, అభివృద్ధి చెందాలన్న శాంతిభద్రతలు ఉండాలని పేర్కొన్నారు.