ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
ప్రజాశక్తి- కరప 'మండలంలోని వేములవాడలో బుధవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.' పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని వేములవాడకు చెందిన పాట్నీడి కృష్ణ భగవాన్ (32), బొండా సాయిమధు (15), రౌతు సురేష్, అప్పనపల్లి సాయి శివరాం, కోట శ్రీను స్నేహితులు. బుధవారం అర్థరాత్రి జరిగిన వివాహ వేడుకల్లో వీరంతా పాల్గొన్నారు. అనంతరం విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్న కోట శ్రీనును కాకినాడ ఆర్టిసి బస్టాండ్ వద్ద దింపేందుకు కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వేములవాడ సమీపంలోకొచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న కారు గోతిలో పడింది.
దీంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢకొీంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో కష్ణ భగవాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో సాయి మధు మార్గంమధ్యలో మృతి చెందాడు. సురేష్కు రెండు కాళ్లు, కుడిచేయి విరిగిపోయింది. సాయి శివరాం స్వల్పంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

