
ప్రజాశక్తి-అమరావతి : ధరణికోట పంచాయతీ 13వ వార్డు పరిధిలో సత్తనపల్లి రోడ్లో పాఠశాలకు సమీపంలోని డంపింగ్ యార్డును తరలించాలని సిపిఎం నాయకులు బి.సూరిబాబు, మొహిదీన్వలి డిమాండ్ చేశారు.
పాఠశాల విద్యార్థులతోపాటు స్థానిక నివాసితులకూ ఇబ్బందికరంగా మారిన ఈ యార్డును నాయకుఉల బుధవారం పరిశీలించారు. ఇక్కడ వ్యర్థాల దహనం వల్ల వచ్చే పొగ సమీపంలోని పాఠశాలలోకి వెళ్లి విద్యార్ధులను ఇబ్బంది పడుతున్నారన్నారు. సమీపంలో మిర్చితొడేలు తీసే గోడౌన్ ఉందని దానిలో కార్మికులు పనిచేస్తారని, వారికీ తీవ్ర ఇబ్బందని చెప్పారు. వర్షాల సమయంలో తీవ్ర దుర్ఘంధం వస్తోందని, ఈ యార్డును సత్వరమే తరలించాలని కోరారు. ఈ అంశంపై ప్రజాశక్తిలో మంగళవారం వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే.