తమిళ నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సిగ్మా' చిత్రం విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను జూలై 31న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.
ఇందులో సందీప్ కిషన్ కథానాయకుడిగా, ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్నారు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకుంది. జేసన్ సంజయ్కు ఇది తొలి దర్శకత్వ చిత్రం కావడం విశేషం.

