ముంబై: భారత క్రికెట్ మాజీ స్టార్ యువరాజ్ సింగ్, క్రికెట్ దిగ్గజాలు ఎంఎస్ ధోనీ మరియు కపిల్ దేవ్లకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. తన తండ్రి యోగ్రాజ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో యువరాజ్ ఈ విధంగా స్పందించాడు.
ఒక స్పోర్ట్స్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ, తన తండ్రి వ్యాఖ్యలు సరైనవి కావని తాను నేరుగా చెప్పినట్లు వెల్లడించారు. "నాన్న, ఇది సరికాదు" అని తన తండ్రికి చెప్పానని యువరాజ్ పేర్కొన్నారు. ఆయన ఇంటర్వ్యూలు విన్నప్పుడు బాధగా అనిపిస్తుందని కూడా తెలిపారు. భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడంలో ధోనీ అసమర్థుడని, అలాగే గతంలో తనను జట్టు నుంచి తప్పించినందుకు కపిల్ దేవ్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన యోగ్రాజ్ సింగ్ మాటలు పెద్ద వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో, గతంలో తన తండ్రి చేసిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలకుగాను సహచర ఆటగాళ్లు, సీనియర్లకు క్షమాపణ చెబుతున్నట్లు యువరాజ్ తెలిపారు. "నేను కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను," అని యువరాజ్ స్పష్టం చేశారు. యువరాజ్ ఇచ్చిన ఈ స్పందన క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
యువరాజ్ తండ్రి ఏమన్నారంటే…
భారతదేశం సాధించిన రెండు ప్రపంచ కప్ విజయాలలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించారు. అయితే, భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడంలో ఎంఎస్ ధోనీ అసమర్థుడని యోగ్రాజ్ సింగ్ చాలాసార్లు ఆరోపించారు. అంతేకాకుండా, 1980లలో యువరాజ్ ను జట్టు నుండి తొలగించినందుకు అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ను చంపాలనుకున్నానని యోగ్రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

