
ప్రజాశక్తి-పెద్దదోర్నాల: కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలందరూ కర్ఫ్యూ నిబంధనలను తప్పక పాటించాలని యర్రగొండపాలెం సిఐ దేవప్రభాకర్ అన్నారు. దోర్నాల పట్టణంలో ఆయన ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ తప్పని పరిస్థితుల్లోనే బయటకు రావాలన్నారు. బయటకు వచ్చిన సమయంలో శానిటైజర్లు, మాస్క్లు ఉపయోగించాలని సూచించారు. ఆయన వెంట ఎఎస్ఐ బ్రహ్మయ్య, పోలీసు సిబ్బంది సురేష్ పాల్గొన్నారు.