తిరువనంతపురం : కేరళ సిపిఐ(ఎం) సీనియర్ నేత టి.పి దాసన్ (76) శనివారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొజికోడ్లోని ఓ ప్రయివేటు ఆసుప్రతిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.
ఈయన కొజికోడ్ మేయర్గానూ పనిచేశారు. కొజికోడ్ టౌన్ ఏరియా కమిటీలో సభ్యుడిగానూ, సుదీర్ఘకాలంపాటు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగానూ ఉన్నారు.

