
కడప : కొండాపురంలో ఫొటోస్టూడియో యజమాని ప్రభాకర రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం జనతా కర్ఫ్యూ పై అవగాహనా ర్యాలీని నిర్వహించారు. దీనిలో భాగంగా కొండాపురంలోని ఇంటింటికి వెళుతూ జనతా కర్ఫ్యూ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి, సిఐ శ్రీరాం శ్రీనివాస్ ,పాఠశాలల యజమానులు, వైద్య సిబ్బంది పాల్గన్నారు.