హైదరాబాద్ : భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ కరోనాను నివారించడంలో 81 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని నిర్ధారణైంది. ఇది బ్రిటన్ వేరియంట్పై కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని మూడవ దశ క్లినికల్ పరీక్షల 'తొలి మధ్యంతర విశ్లేషణ'లో వెల్లడైనట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఈ మధ్యంతర విశ్లేషణ కోసం 43 కేసులు పరిశీలించి.. తద్వారా దీనికి 81 శాతం ప్రభావశీలత ఉన్నట్లు నిర్థారణకు వచ్చినట్లు పేర్కొంది. ఇందులో తీవ్ర స్థాయిలో, వైద్య పరంగా ప్రతికూల సంఘటనలు చోటుచేసుకున్నవి చాలా తక్కువని విశ్లేషణలో తేలినట్లు సంస్థ వెల్లడించింది. తదుపరి మధ్యంతర విశ్లేషణలో 87 కేసులు, తుది విశ్లేషణలో 130 కేసులపైైె ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొంది.

