హిందూపురం : ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం హిందూపురం కోవిడ్ ఆసుపత్రికి రూ.15 లక్షలు విలువజేసే కోవిడ్ మందులను అందించారు. ఆర్అండ్బి అథితి గృహంలో టిడిపి నాయకులు మెడికల్ సుపరిడెంటెండ్ దివాకర్కు వీటిని అందించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ గతేడాది కరోనా విపత్కర సమయంలో కోట్లాది రూపాయాలు వెచ్చించి అసుపత్రికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించారన్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో బాలకృష్ణ హైదరాబాద్లో ఉన్నప్పటకీ అక్కడి నుంచి విలువైన మందులను పంపించారని చెప్పారు. హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇస్టిట్యూట్, ఎన్బికె సేవా సమితి సౌజన్యంతో ప్రత్యేకంగా వచ్చిన వాహనంలో మందులను హిందూపురానికి తీసుకొచ్చినట్లు చెప్పారు.

