Dailyhunt
కుమారుడికి దెయ్యం పట్టిందని.. కన్నతల్లే కొట్టి చంపింది

కుమారుడికి దెయ్యం పట్టిందని.. కన్నతల్లే కొట్టి చంపింది

చెన్నై : కన్నతల్లే.. కుమారుడికి దెయ్యం పట్టిందని.. అతి కిరాతకంగా కొట్టి చంపిన ఘటన తాజాగా వెలుగుచూసింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామల్లై జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...ఏడేళ్ల తన కుమారుడికి గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో.. తల్లి ఓ స్వామిజీని కలిసింది. ఆ స్వామిజీ..తన కుమారుడికి దెయ్యం పట్టిందని చెప్పాడు. కుమారుడికి పట్టిన దెయ్యం వదిలించడానికి మూడురోజులుగా తల్లితోపాటు.. మరో ముగ్గురు మహిళలు కలిసి ఆ బాలుడిని కొడుతూనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. పోలీసులకు సమాచారమందిచారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే.. తల్లి పెట్టిన చిత్రహింసలకు తాళలేక బాలుడు మృతి చెందాడు.

దీంతో తల్లితో సహా.. ముగ్గురు మహిళల్ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. విచారణలో.. తన కుమారుడికి దెయ్యంపట్టిందని.. దాన్ని వదిలించడానికే కొట్టినట్లు అమె తెలిపారు. అయితే నిందితురాలు తల్లికే మానసిక పరిస్థితి సరిగ్గాలేదని, ఆసుపత్రిలో వైద్యం అందించి.. తర్వాత రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti