Dailyhunt
కుష్టు వ్యాధిపై అవగాహన తప్పనిసరి

కుష్టు వ్యాధిపై అవగాహన తప్పనిసరి

ప్రజాశక్తి-సంతనూతలపాడు రూరల్‌ : కుష్టు వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డిపిఎంవో శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సచివాలయాం2లో సంతనూతలపాడుపిహెచ్‌సి ఆధ్వర్యంలో సచివాలయం గ్రామ వాలంటీర్లకు కుష్టువ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిపిఎంవో మాట్లాడుతూకుష్టు వ్యాధి ప్రాథమిక దశలోనేగుర్తిస్తే అంగవైకల్యం బారినుండి రక్షించుకోవచ్చని వివరించారు. వ్యాధి సోకిన వారిలో పొడలు ఏవిధంగా పరీక్ష చెయ్యాలి , తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. స్పర్శలేనిమచ్చలు ఎలా గుర్తించాలని ప్రాధమిక దశలో కేసులను గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే అంగవైకల్యాన్ని నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌యంలు సచివాలయ సిబ్బంది ఆశాలు వర్కర్లు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti