
శ్రీకాకుళం : అరబిందో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... బుధవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో పైడిభీమవరంలో అరబిందో కార్మికులు మోకాళ్లపై కూర్చొని ధర్నా చేపట్టారు. అరబిందో కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.