నగర పంచాయతీ కమిషనర్గా వెంకటయ్య
ప్రజాశక్తి-బి.కొత్తకోట : బి.కొత్తకోట నగర పంచాయతీ నూతన కమిషనర్గా వెంకటయ్య గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మేజర్ పంచాయతీగా ఉన్న బి.కొత్తకోట రాష్ట్ర ప్రభుత్వం నగర పంచాయతీగా ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విధితమే. దీంతో తాత్కాలిక కమిషనర్గా పుంగనూరు మునిసిపల్ కమిషనర్ కే.ఎల్.వర్మను నియమించింది. ఇక పూర్తిస్థాయి నగర కమిషనర్గా గతంలో రెవెన్యూలో ఆర్వోగా విధులు నిర్వహిస్తున్న వెంకటయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేయడంతో వెంకటయ్య నగర కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు.

