నిరుపేదలకు నిత్యావసర సరుకులు
ప్రజాశక్తి-బంటుమిల్లి
బంటుమిల్లి మండలం నాగేశ్వర పేట గ్రామపంచాయతీ జానకిరామ్ పురం గార్లగుంట పరిధిలో పాజిటివ్ కేసులు వచ్చిన 50 నిరుపేద కుటుంబాలకు మొదటివార్డు సభ్యులు, ప్రజాశక్తి రిపోర్టర్ గ్రుద్ధటి శ్రీనివాస రావు (బొమ్మ) 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. కూరగాయలు, పాలు, పెరుగు, ఉల్లిపాయలు, వేరుశెనగ నూనె, బూస్ట్, హార్లిక్స్, మిరియాలు, శొంఠి తదితర నిత్యావసర వస్తువులు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, గ్రుద్ధటి జోత్స్న, పెద్ది శివాజీ, తోట ప్రసాద్, గుబ్బల శ్రీమన్నారాయణ, రాము, మస్తాన్, కనకం, శేఖర్, ధర్మ తేజ, అశోక్, కార్తికేయ, సాయి తదితరులు పాల్గొన్నారు.

