ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : మండలంలో రభి పంటలో దాన్యాన్ని పూర్తిగా కోనుగోలు చేస్తామని రైతులు ఆందోళన పడవద్దని గణపవరం తాశీల్థార్ వైకెవి అప్పారావు మంగళవారం తెలిపారు.
రభీలో 12300 ఎకారాలలో వరిసాగు జరిగిందని తెలిపారు 50 వేల మెట్రిక్ టన్నుల దాన్యం దిగుబడి వచ్చినట్లుచెప్పారు. ఇప్పటికే 15 రైతు సేవా కేంద్రాలు ద్వారా 25000 మెట్రిక్ దాన్యాన్ని ప్రభుత్వం కోనుగోలు చేసినట్లుచెప్పారు వాతావరణం లో మార్పులు రావటంతో ఆందోళన చెందిన రైతులు రైతు సేవాకేంద్రాలలో సంచులు అన్ని ఒకేసారి పట్టుకు పోవటంతో కోద్దిమంది రైతులకు సంచులు అందక ఇబ్బందులు పడ్డారని అన్నారు మండలంలో మిగిలిన 25000 మెట్రిక్ టన్నుల దాన్యానికి సంచులు అందచేస్తామని రెండురోజుల లో కోనుగోలు చేస్తామని అన్నారు. మిల్లుల వద్ద ఏదైన ఇబ్బందులు ఉంటే 8688763772 కాని 8331056685 కి పోను చేసి సంప్రందించాలని చెప్పారు.

