Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సుప్రీంకోర్టు ఈమెయిల్స్‌లో ప్రధాని మోడీ యాడ్‌.. తొలగించాలని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం

సుప్రీంకోర్టు ఈమెయిల్స్‌లో ప్రధాని మోడీ యాడ్‌.. తొలగించాలని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను ప్రోత్సహించడానికి కేంద్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.

ఇది ఆరు నెలల క్రితం మొదలు పెట్టగా.. పెద్ద యెత్తున ప్రచారం చేస్తుంది. అయితే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుండి అడ్వకేట్లకు వస్తున్న ఈ మెయిల్స్‌లో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోడీ ఫోటోలతో కూడిన యాడ్స్‌ రావడం ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తోంది. ఈ మెయిల్స్‌లో ఆయన చిత్రాలు రావడాన్ని కొంత మంది సీనియర్‌ అడ్వకేట్లు ధ్రువీకరించారు. ఈ చర్య న్యాయ వ్యవస్థ, కార్యనిర్వహకతను వేరు చేసే సన్నటి గీతను చెరిపేసినట్లు అయిందని అన్నారు. దీనిపై రిజిస్ట్రీ స్పందించింది. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసి) .. అత్యున్నత న్యాయస్థానం తరుపున ఈ మెయిల్‌ సర్వీసు సేవలను అందిస్తుందని శుక్రవారం రాత్రి రిజీస్ట్రి ప్రకటన చేసింది. సుప్రీంకోర్టు నుండి వచ్చిన ఈ మెయిల్స్‌ ఫుటర్ల నుండి ఆ చిత్రాలను తొలగించాలని ఆదేశించింది. దీనికి బదులుగా సుప్రీంకోర్టు చిత్రాలను ఉంచాలని ఆదేశించామని, ఎన్‌ఐసి వాటిని పాటిస్తుందని పేర్కొంది. సుప్రీంకోర్ట్‌ అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ అసోషియేషన్‌ వాట్సప్‌ గ్రూపులో ఓ న్యాయవాది ఈ విషయాన్ని పోస్ట్‌ చేసిన కొన్ని గంటల తర్వాత రిజిస్ట్రీ స్పందించింది.
సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ సంజీవ్‌ ఎస్‌ కల్గావ్‌కర్‌ తనకు అలాంటి సంఘటన గురించి తెలియదని చెప్పినప్పటికీ.. న్యాయవాదుల నుండి అధికారిక ఫిర్యాదు వచ్చిన తర్వాత, తదుపరి కార్యాచరణ ప్రణాళిక చేపడతామని అడ్వకేట్స్‌-ఆన్‌-రికార్డ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జోసెఫ్‌ అరిస్టాటిల్‌ చెప్పారు. దీనిపై ఎన్‌ఐసి అధికారులను ప్రశ్నించగా..ఈ స్రిప్ట్‌ను అన్ని ఎన్‌ఐసి వేదికలపై వినియోగించామని, అయితే సుప్రీంకోర్టు వేదిక నుండి తొలగించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొంది. కొన్ని గంటల తర్వాత రిజిస్ట్రీ స్పందిస్తూ.. సుప్రీంకోర్టుకు చెందిన అధికారిక ఈ మెయిల్స్‌ నుండి ఈ చిత్రం వెళ్లినట్లు శుక్రవారం గుర్తించామని, దీనికి, న్యాయ వ్యవస్థకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటన చేసింది. ఈ మెయిల్‌లో ప్రకటనల గురించి సీనియర్‌ అడ్వకేట్‌ చందర్‌ ఉదరు సింగ్‌ మాట్లాడుతూ... అవి అత్యంత అభ్యంతరకరమైనవిగా అభివర్ణించారు. భారత్‌లోని న్యాయ వ్యవస్థలు.. ప్రభుత్వ కార్యాలయాలు కావని, ప్రభుత్వ ప్రచార యంత్రాలుగా వీటిని వినియోగించకూడదని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti