Dailyhunt
Telangana : పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి.. ఐదు గేట్లు ఎత్తివేత

Telangana : పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి.. ఐదు గేట్లు ఎత్తివేత

సూర్యాపేట (తెలంగాణ) : ఎగువ నుండి చేరుతున్న వరద నీటి కారణంగా పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తివేసి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ ఫ్లో 85,406 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 60,962 క్యూసెక్కులుగా నమోదయింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టిఎంసిలు. ప్రస్తుత సామర్థ్యం 33.27 టిఎంసి లకు చేరింది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 166.27 అడుగులకు చేరింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti