Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉపరాష్ట్రపతికి అమరావతి పుస్తకం అందజేత

ఉపరాష్ట్రపతికి అమరావతి పుస్తకం అందజేత

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధాని అమరావతిపై ముద్రించిన పుస్తకాన్ని టిడిపి ఎంపిలు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు మంగళవారం అందజేశారు. పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో పలువురు ఎంపిలతో కలిసి సిపి రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా అమరావతి రాజధానిపై 'బిల్ట్ బై ద పీపుల్ సెక్యూర్డ్‌ బై డెస్టినీ' పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాల వారసత్వం నుంచి, రాజధాని పరిరక్షణ కోసం అమరావతి రైతులు, మహిళలు 1,631 రోజుల పాటు చేసిన సుదీర్ఘ పోరాట విశేషాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. 2024 జూన్ రెండు నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా పునరుద్ధరించిన చారిత్రక పరిణామాలు ఈ పుస్తకంలో వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, ఎన్‌డిఎ ప్రభుత్వ మద్దతుతో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతున్నామని శ్రీకృష్ణదేవరాయలు వివరించారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti