Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'మెడికవర్'లో అడ్వాన్స్‌డ్ ఐ సెంటర్ ప్రారంభం

'మెడికవర్'లో అడ్వాన్స్‌డ్ ఐ సెంటర్ ప్రారంభం

- సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మరింత విస్తరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ యూనిట్‌లో సమగ్ర కంటి వైద్య సేవలను అందించే అత్యాధునిక అడ్వాన్స్‌డ్ ఐ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించింది.

ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి, సామాజిక సేవకురాలు అమల అక్కినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఐ సెంటర్‌లో కాటరాక్ట్, రెటినా, రిఫ్రాక్టివ్, కార్నియా, న్యూరో-ఆఫ్తాల్మాలజీ సేవలను ఒకేచోట అత్యాధునిక సాంకేతికతతో అందుబాటులోకి తీసుకొచ్చారు. నేత్ర వైద్య నిపుణుల బృందం ద్వారా ప్రపంచస్థాయి నిర్ధారణ, చికిత్స, శస్త్రచికిత్స సేవలను ఈ కేంద్రం అందించనుంది. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ ప్రజలకు అత్యాధునిక కంటి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు వస్తున్న మెడికవర్ హాస్పిటల్ ప్రయత్నాన్ని అభినందించారు. కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం, సమయానికి చికిత్స పొందడం ద్వారా దృష్టి కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించవచ్చని అన్నారు. కాగా, ఈ కేంద్రంలో ప్రత్యేక రెటీనా, విట్రియో-రెటినల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెటినా లేజర్ చికిత్సలు, ప్రీమెచ్యూర్ శిశువుల్లో వచ్చే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ చికిత్స, డయాబెటిక్ విట్రెక్టమీ, రెటినల్ డిటాచ్‌మెంట్ శస్త్రచికిత్సలు, యువియాటిస్ నిర్వహణ, కాటరాక్ట్ శస్త్రచికిత్స అనంతర సమస్యల చికిత్సలు ఉన్నాయి. అలాగే క్లిష్టమైన కంటి-నర సంబంధిత సమస్యలకు న్యూరో ఆఫ్తాల్మాలజీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాటరాక్ట్ చికిత్స విభాగంలో ఫేకోఎమల్సిఫికేషన్‌తో ఫోల్డబుల్ ఇంట్రా ఆక్యులర్ లెన్స్ (ఐవోఎల్) అమరిక, స్మాల్ ఇన్సిషన్ కాటరాక్ట్ సర్జరీ వంటి ఆధునిక శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు సెంటర్ సన్నద్ధమైంది. వీటి ద్వారా రోగులకు త్వరితగతిన కోలుకునే అవకాశం, మెరుగైన చూపు లభిస్తుంది. అదేవిధంగా లాసిక్, స్మైల్, పీఆర్‌కే, రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్, ఇంప్లాంటబుల్ కాలామర్ లెన్స్ (ఐసీఎల్), కెరటోకోనస్‌కు కార్నియల్ కొలాజెన్ క్రాస్‌లింకింగ్ (సీ 3 ఆర్) వంటి ఆధునిక రిఫ్రాక్టివ్, కార్నియా చికిత్సలు కూడా అందించనున్నారు. ఇంకా ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్లు, వైఏజీ క్యాప్సులోటమీ, పెరిఫెరల్ వైఏజీ ఇరిడోటమీ, చలేజియన్ ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్, తరచూ వచ్చే చలేజియన్ సమస్యలకు ఇంట్రాలెషనల్ స్టెరాయిడ్ చికిత్సలు వంటి సమగ్ర నేత్ర వైద్య సేవలు కూడా ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటాయి. ఈ అడ్వాన్స్‌డ్ ఐ సెంటర్ ప్రారంభం ద్వారా తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన, అందుబాటు ధరల్లో కంటి వైద్య సేవలను అందించాలనే తమ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం డయాబెటిస్ కారణంగా వచ్చే రెటినా సమస్యలు, కాటరాక్ట్, రిఫ్రాక్టివ్ లోపాలు, జీవనశైలి కారణమైన కంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సమయానుకూలంగా ఆధారబద్ధమైన వైద్య సేవలను ఈ సెంటర్ ద్వారా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ జ్యోత్స్న మైనేని (సీనియర్ కన్సల్టెంట్-రెటినా అండ్ యువియాటిస్), డాక్టర్ హరినాథ్‌బాబు కార్లపూడి (కన్సల్టెంట్ ఆఫ్తాల్మాలజిస్ట్), డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ వీరగంధం (సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్), డాక్టర్ రామకృష్ణ రావూరి (హెడ్-అనస్తీషియాలజీ విభాగం), మహేష్ డెగ్లూర్కర్ (చీఫ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్), డాక్టర్ జానకిరామ్ (రీజినల్ డైరెక్టర్), శ్రీకాంత్ (సెంటర్ హెడ్) పాల్గొన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News