Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాల పరిరక్షణకు సచివాలయ ఉద్యోగుల కార్యాచరణ

తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాల పరిరక్షణకు సచివాలయ ఉద్యోగుల కార్యాచరణ

PVRNEWS 1 week ago
  • డిసెంబరు 9న 200 పేజీల ప్రత్యేక సావనీర్‌ ఆవిష్కరణ
  • ఏపీకి వెళ్లే 24 మంది అధికారుల ప్రక్రియను స్నేహపూర్వకంగా పూర్తి చేయాలని నిర్ణయం

​పీవీఆర్ న్యూస్ 777, హైదరాబాద్‌, ఆగస్టు 17,2026:

తెలంగాణ ఉద్యమంలో సచివాలయ ఉద్యోగులు సాగించిన చారిత్రక పోరాట ఘట్టాలు, అనుభవాలను రికార్డు చేసి భావితరాలకు అందించేందుకు సచివాలయ తెలంగాణ ఉద్యమకారుల వేదిక నిర్ణయించింది. వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉద్యమ స్ఫూర్తి పరిరక్షణ, ప్రస్తుత పరిణామాలపై విస్తృతంగా చర్చించారు.

నజీర్‌ భాయ్‌కు ఘన నివాళి

సమావేశం ప్రారంభంలో తోటి ఉద్యమకారుడు శ్రీ నజీర్ భాయ్ అకాల మరణం పట్ల సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు.

ప్రజాస్వామిక స్ఫూర్తిని భద్రపరచడమే లక్ష్యం

ప్రపంచ చరిత్రలోనే శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతుల్లో సాగిన తెలంగాణ ఉద్యమం ఒక ఆదర్శంగా నిలిచిందని నేతలు పేర్కొన్నారు. సచివాలయంలో ఉద్యమ వివిధ దశలు, ఉద్యోగుల పోరాట అనుభవాలు, కీలక దృశ్యాలను సేకరించి చరిత్రలో నిక్షిప్తం చేయాలని తీర్మానించారు. ఇందులో భాగంగా రాబోయే డిసెంబరు 9న దాదాపు 200 పేజీల సమగ్ర సావనీర్‌ను ఘనంగా విడుదల చేయాలని నిర్ణయించారు.

24 మంది అధికారుల విషయంలో సానుకూల నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ స్థానికత కలిగి, అక్కడికి వెళ్లేందుకు ఆప్షన్ ఇచ్చిన 24 మంది సచివాలయ అధికారులను తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సమావేశంలో దీనిపై చర్చించారు. ఎలాంటి అపార్థాలకు తావులేకుండా, పరస్పర గౌరవం, స్నేహపూర్వక వాతావరణంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని వేదిక ప్రతిపాదించింది.

కార్యక్రమాల నిర్వహణకు మూడు కమిటీల ఏర్పాటు

​ఈ కార్యాచరణను సమర్థంగా ముందుకు తీసుకెళ్లేందుకు వేదిక ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక కమిటీలను నియమించారు:

1. సావనీర్ కమిటీ:

  • ​మంగదొడ్డి శ్రీనివాస్ (ఎస్.ఓ)
  • ​వి. రమేష్ (ఎస్.ఓ)
  • ​టి. వెంకటరమణ (ఎస్.ఓ)
  • ​బి. స్వామి (డిప్యూటీ సెక్రటరీ)
  • ​ఎస్. కిషోర్ కుమార్ (ఎస్.ఓ)
  • ​ఎం. దేవేందర్ రెడ్డి (ఎస్.ఓ)
  • ​కె. శ్రీనివాస రావు (ఎస్.ఓ)
  • ​వి. ఉమానాగలక్ష్మి (ఎస్.ఓ)
  • ​బి. నీరజ (ఎస్.ఓ)
  • ​పి. శివాజీ (ఎస్.ఓ)

2. ఆర్గనైజింగ్ కమిటీ:

  • ​ఎన్. సురేష్ కుమార్ (ఎస్.ఓ)
  • ​కె. రమాదేవి (డిప్యూటీ సెక్రటరీ)
  • ​మనోహరమ్మ (అసిస్టెంట్ సెక్రటరీ)
  • ​ఇ. నాగరాజు (ఎస్.ఓ)
  • ​బి. ప్రవీణ్ కుమార్ (ఎస్.ఓ)
  • ​టి. స్వరణ్ రాజు (ఎస్.ఓ)
  • ​ఆర్. తిరుపతి రెడ్డి (ఎస్.ఓ)
  • ​పి. శివ రామకృష్ణ (ఎస్.ఓ)
  • ​జి. ప్రశాంత్ కుమార్ (ఎస్.ఓ)
  • ​అరవింద్ గౌడ్ (ఏ.ఎస్.ఓ)

3. రిసోర్స్ మొబిలైజేషన్ కమిటీ:

  • ​పి. శ్యామ్ సుందర్ (అసిస్టెంట్ సెక్రటరీ)
  • ​రెండ్ల రాజేష్ (ఎస్.ఓ)
  • ​కె. రాజేశ్వర్ రెడ్డి (ఎస్.ఓ)
  • ​లలిత కుమారి (అసిస్టెంట్ సెక్రటరీ)
  • ​నేతి మంగమ్మ (అసిస్టెంట్ సెక్రటరీ)
  • ​జె. వినోద్ కుమార్ (అసిస్టెంట్ సెక్రటరీ)
  • ​కె. రంజీత్ కుమార్ (అసిస్టెంట్ సెక్రటరీ)
  • ​కె. స్వామి (ఎస్.ఓ)
  • ​ఎన్. సైదులు (ఎస్.ఓ)
  • ​బి. జయ హరి (డీఆర్‌ అండ్‌ టీ అసిస్టెంట్)
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: PVRNEWS