Priyanka Chopra: 'పెద్ది' సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో హైప్ తెచ్చుకుంటోంది. రామ్ చరణ్ Ram Charan హీరోగా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు బుచ్చిబాబు సాన Buchi Babu Sana దర్శకత్వం వహిస్తున్నారు.

Priyanka Chopra: 'పెద్ది' సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో హైప్ తెచ్చుకుంటోంది. రామ్ చరణ్ Ram Charan హీరోగా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు బుచ్చిబాబు సాన Buchi Babu Sana దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ ట్రైలర్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులను కూడా ఇంప్రెస్ చేసింది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ Priyanka Chopra Jonas కూడా సోషల్ మీడియాలో ట్రైలర్ను షేర్ చేస్తూ మూవీ టీమ్కు అభినందనలు తెలిపారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ Janhvi Kapoor, దివ్యేందు శర్మ Divyenndu Sharma, దర్శకుడు బుచ్చిబాబు సానతో పాటు మొత్తం టీమ్కు ఆమె శుభాకాంక్షలు చెప్పారు.
విదేశాల్లో కూడా 'పెద్ది'కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే 100K డాలర్ల మార్క్ దాటినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించిందని తెలుస్తోంది.
సినిమాకు A. R. రెహమాన్ అందించిన సంగీతం కూడా పెద్ద ప్లస్ అయింది. ఇప్పటికే విడుదలైన "చికిరి చికిరి" పాట 200 మిలియన్ వ్యూస్ దాటగా, "రాయ్ రాయ్ రా రా" పాట 70 మిలియన్ వ్యూస్ దాటింది. ఈ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరింత హైప్ పెంచేందుకు మూవీ టీమ్ మే 23న భోపాల్లో "#PeddiKiAwaz" పేరుతో భారీ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో కొత్త పాట విడుదలతో పాటు ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండనుంది.
ఈ సినిమాలో శివ రాజ్కుమార్ Shiva Rajkumar, జగపతి బాబు Jagapathi Babu కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు ఛాయాగ్రాహకుడిగా ఆర్. రత్నవేలు R. Rathnavelu, ప్రొడక్షన్ డిజైనర్గా అవినాష్ కొల్లా, ఎడిటర్గా నవీన్ నూలి పని చేస్తున్నారు.
భారీ ప్రమోషన్స్, విదేశీ మార్కెట్లో మంచి బుకింగ్స్, సూపర్ హిట్ పాటలు, రామ్ చరణ్ కొత్త లుక్తో 'పెద్ది' ప్రస్తుతం ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటిగా మారింది.