ఈ నిర్ణయం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో తీసుకున్నారు. కార్యక్రమానికి ప్రజలను తరలించేందుకు ప్రైవేట్ బస్సులను వినియోగించాల్సి రావడంతో, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేట్ పాఠశాలలకు రెండు రోజుల సెలవులు ప్రకటించారు.
ఇక తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఇవాళ ఒక్కరోజు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది.

