- లోతైన సముద్రపు డైవింగ్: రెండు దేశాల డైవర్లు 55 మీటర్ల కంటే ఎక్కువ లోతులో డైవింగ్ చేసి తమ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
- మిశ్రమ గ్యాస్ డైవింగ్: సంక్లిష్టమైన నీటి అడుగున మిషన్ల కోసం కీలకమైన 'మిక్స్డ్ గ్యాస్ డైవింగ్' డ్రిల్స్ను నిర్వహించారు.
- చారిత్రక ప్రాధాన్యత: రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి చారిత్రక నౌకల శిథిలాలు (SS Worcester, SS Perseus) ఉన్న ప్రాంతాల్లో ఈ విన్యాసాలు చేపట్టడం విశేషం.
- ఈ విన్యాసాలు కేవలం సైనిక శిక్షణకే పరిమితం కాకుండా, ఇరు దేశాల మధ్య రక్షణ దౌత్యాన్ని మరింత బలోపేతం చేశాయి. శ్రీలంక రియర్ అడ్మిరల్ SJ కుమార INS నిరీక్షక్ను సందర్శించి, శ్రీలంక డైవర్లకు భారత్ అందిస్తున్న శిక్షణను అభినందించారు.
- అంతేకాకుండా, నౌకాదళ సిబ్బంది మధ్య స్నేహపూర్వక సంబంధాల కోసం గాలే ఫేస్ వద్ద బీచ్ క్లీనింగ్ డ్రైవ్, యోగా సెషన్లు మరియు క్రీడా పోటీలను నిర్వహించారు.
- భారత్ తన 'ఆరోగ్య మైత్రి' చొరవలో భాగంగా శ్రీలంకకు BHISM క్యూబ్స్ (పోర్టదుల్ మెడికల్ యూనిట్లు) అందజేసింది. విపత్తుల సమయంలో తక్షణ వైద్య సహాయం అందించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
- ప్రాంతీయ భద్రతతో పాటు మానవతా దృక్పథంతో భారత్ వ్యవహరిస్తున్న తీరుకు ఇది నిదర్శనం.
- విన్యాసం పేరు: IN-SLN DIVEX 2026 (4వ ఎడిషన్).
- పాల్గొన్న దేశాలు: భారత్ మరియు శ్రీలంక.
- వేదిక: కొలంబో, శ్రీలంక.
- తేదీలు: 21 ఏప్రిల్ నుంచి 28 ఏప్రిల్, 2026.
- భారత నౌక: INS నిరీక్షక్.
- ప్రధాన లక్ష్యం: సముద్ర భద్రత, ఇరు దేశాల నౌకాదళాల మధ్య సమన్వయం (Interoperability).
- మానవతా సాయం: భారత్ అందించిన BHISM మెడికల్ క్యూబ్స్.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

