- బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల ఎగుమతి: సుమారు రూ.5,694 కోట్ల విలువైన ఒప్పందంతో ఇండోనేసియాకు సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి 'బ్రహ్మోస్', గగనతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే 'అస్త్ర' క్షిపణులను భారత్ సరఫరా చేయనుంది.
- సబాంగ్ నౌకాశ్రయం : మలక్కా జలసంధి సమీపంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సబాంగ్ పోర్ట్ను భారత్, ఇండోనేసియాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి. ఇది భారత 'గ్రేట్ నికోబార్ పోర్ట్ ప్రాజెక్ట్'కు కేవలం 100 మైళ్ల దూరంలో ఉండటం వ్యూహాత్మకంగా భారత్కు కలిసొచ్చే అంశం.
- సముద్రయాన భద్రత : హిందూ మహాసముద్ర ప్రాంతంలోని భారత 'ఇంటిగ్రేటెడ్ ఫ్యూజన్ సెంటర్'లోకి ఇండోనేసియా తమ 'లియేసన్ ఆఫీసర్'ను నియమించేందుకు అంగీకారం కుదిరింది.
- యూపీఐ అనుసంధానం: ఇండోనేసియా చెల్లింపుల వ్యవస్థతో భారతదేశపు 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్' అనుసంధానం కానుంది. దీనిద్వారా ఇండోనేసియా పౌరులకు యూపీఐ సేవలు అందుబాటులోకి వస్తాయి.
- ఐఐఎం బెంగళూరు క్యాంపస్: ఇండోనేసియాలోని ఈస్ట్ జావా ప్రావిన్స్లో ఉన్న సింఘసారీ స్పెషల్ ఎకనమిక్ జోన్లో ప్రతిష్టాత్మక 'ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్' బ్రాంచ్ను ఏర్పాటు చేయనున్నారు.
- పెట్టుబడులు - సరఫరా గొలుసు: ఉక్కు, నికెల్, అరుదైన భూ అయస్కాంతాలు మరియు ఇతర మూలకాల సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి ఇండోనేసియా పరిశ్రమల్లో భారత్ భారీగా పెట్టుబడులు పెట్టనుంది.
- ఎన్నికల నిర్వహణ: ఎన్నికల నిర్వహణ అనుభవాన్ని పంచుకోవడంతో పాటు, ఇండోనేసియాకు ఈవీఎంల ఎగుమతికి సంబంధించి ఇరుదేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
- ఇరుదేశాల మధ్య సత్సంబంధాల బలోపేతానికి మోదీ చేస్తున్న కృషికి గుర్తింపుగా, ఇండోనేసియా ప్రభుత్వం తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారం 'బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా' తో ప్రధాని మోదీని సత్కరించింది. అధ్యక్షుడు సుబియంతో స్వయంగా ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు.
- యోగాకర్త నగరంలోని ప్రపంచ వారసత్వ సంపదైన వెయ్యేళ్ల నాటి అతిపెద్ద శివాలయం 'ప్రాంభనన్'ను ప్రధాని మోదీ సందర్శించారు. 10వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయ కాంప్లెక్స్ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్ట్లో భారత్ పాలుపంచుకోనుంది.
- "సంస్కరణలు, పనితీరు, పెనుమార్పు మంత్రంతో భారత్ ముందుకు దూసుకెళ్తోంది."
- "భారత్ ఏనాడైనా అభివృద్ధి బాటనే అనుసరిస్తుంది. రాజ్య విస్తరణవాదం వైపు అస్సలు నడవదు." (చైనాను పరోక్షంగా ఉద్దేశిస్తూ).
- "స్వేచ్ఛాయుత, పారదర్శకమైన, సమ్మిళిత ఇండో-పసిఫిక్ కోసం భారత్ ఎల్లప్పుడూ కృషిచేస్తుంది."
- "గత ఏడాది భారత పర్యటన ముగించుకుని తిరిగిరాగానే జన్యక్రమ విశ్లేషణ (DNA) పరీక్ష చేయించుకున్నా. నాలో భారతీయ డీఎన్ఏ ఉన్నట్లు నిర్ధారణ అయింది."
- "భారత్లో ప్రధాని మోదీ చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అచ్చుగుద్దినట్లు ఇండోనేసియాలో నేను కాపీ చేసి అమలు చేస్తున్నాను, దీన్ని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించను."
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

