Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NEET Re-Exam 2026:నీట్ రీఎగ్జామ్ 2026 మిలిటరీ స్థాయి భద్రతతో నిర్వహణ.. స్వయంగా పర్యవేక్షిస్తున్న ప్రధాని మోదీ!

NEET Re-Exam 2026:నీట్ రీఎగ్జామ్ 2026 మిలిటరీ స్థాయి భద్రతతో నిర్వహణ.. స్వయంగా పర్యవేక్షిస్తున్న ప్రధాని మోదీ!

SAKSHI EDUCATION 2 weeks ago

సారి నీట్ రీ-ఎగ్జామ్‌ను పూర్తి భద్రతతో నిర్వహించేందుకు తొలిసారిగా భారత సైన్యాన్ని రంగంలోకి దింపుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా పర్యవేక్షణ, నిఘా వ్యవస్థల్లో ఆర్మీ సిబ్బంది పాల్గొననున్నారు.

అలాగే ప్రశ్నాపత్రాల రవాణా సమయంలో ఎలాంటి లీకేజీలు జరగకుండా అత్యంత రహస్యంగా నిర్వహించేందుకు భారత వైమానిక దళం సేవలను వినియోగించనున్నారు. దీనివల్ల ప్రశ్నాపత్రాల భద్రత మరింత బలోపేతం కానుంది.

ప్రశ్నాపత్రాల రూపకల్పన నుంచి ప్రింటింగ్, రవాణా, జిల్లా కేంద్రాలకు పంపిణీ వరకు ప్రతి దశను ప్రధానమంత్రి కార్యాలయం నేరుగా పర్యవేక్షించనుంది. గతంలో వచ్చిన విమర్శలు పునరావృతం కాకుండా కేంద్రం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

  • అడ్మిట్ కార్డుల విడుదల: జూన్ 14
  • NEET Re-Exam తేదీ: జూన్ 21
  • దేశవ్యాప్తంగా పరీక్షా నిర్వహణ
  • అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను సమయానికి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాలి.
  • కొత్త భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
  • ఎలక్ట్రానిక్ పరికరాలు, నిషేధిత వస్తువులు తీసుకురావద్దు.

ఈసారి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో NEET పరీక్ష నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరుగుతోంది. పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పరీక్ష నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education