సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఉన్న మున్సిపల్ కార్యాలయంలో ఏప్రిల్ 8వ తేదీ భారీ ఉద్యోగ మేళా నిర్వహించబడుతోంది.
ఈ జాబ్మేళాలో కియా ఇండియా, టాటా ఎలక్ట్రానిక్స్, అపోలో ఫార్మసీ వంటి పది ప్రముఖ కంపెనీలు పాల్గొని అందులోని ఖాళీలను భర్తీ చేయనున్నాయి. పదవ తరగతి నుంచి డిగ్రీ, డిప్లొమా చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికేట్లతో నేరుగా హాజరుకావలెను. మరిన్ని వివరాల కోసం 9440838388 నంబర్ను సంప్రదించండి.
| క్రమ సంఖ్య | సంస్థ పేరు | ఖాళీలు |
|---|---|---|
| 1 | ఎస్ఆర్ షాపింగ్ మాల్ (SR Shopping Mall) | 20 |
| 2 | డీమార్ట్ (DMart) | 30 |
| 3 | ఫ్లిప్కార్ట్ (Flipkart) | 40 |
| 4 | జాస్పర్ (JASPER) | 40 |
| 5 | ఇన్నోవ్సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (Innovsource Services Pvt. Ltd) | 30 |
| 6 | జగదీష్ మెరైన్ ఎక్స్పోర్ట్స్ (Jagadeesh Marine Exports) | 30 |
| 7 | అపోలో ఫార్మసీ (Apollo Pharmacy) | 20 |
| 8 | కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (KIA India Pvt. Ltd.) | 50 |
| 9 | ఫాక్స్కాన్ రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Foxconn Raising Stars Mobile India Pvt Ltd) | 30 |
| 10 | టాటా ఎలక్ట్రానిక్స్ (Tata Electronics) | 30 |
- తేదీ: 08-04-2026 (బుధవారం)
- వేదిక: మున్సిపల్ కార్యాలయం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా
- సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 9440838388

