Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అరవింద్ కేజ్రీవాల్ పై కోర్టు ధిక్కరణ కేసు

అరవింద్ కేజ్రీవాల్ పై కోర్టు ధిక్కరణ కేసు

Satyam NEWS 1 week ago

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు అయింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.

ఢిల్లీ హైకోర్టు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి మాజీగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్‌లపై ఢిల్లీ హైకోర్టు క్రిమినల్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రక్రియలను ప్రారంభించింది.

న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ పై ఈ నేతలు చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలు న్యాయస్థానంపై ప్రజల్లో అవిశ్వాసం కలిగించేలా ఉండటమే కాకుండా, న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రభావితం చేసే స్వభావం కలిగి ఉన్నాయని జస్టిస్ శర్మ పేర్కొన్నారు. అందువల్ల ఈ వ్యవహారం "క్రిమినల్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్" పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు.

ఇటీవల వెలువడిన కొన్ని కేసుల తీర్పుల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేసిన రాజకీయ విమర్శలు, సోషల్ మీడియా వ్యాఖ్యలు, ప్రజా వేదికలపై చేసిన వ్యాఖ్యానాలను కోర్టు తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. న్యాయమూర్తిపై వ్యక్తిగత ఆరోపణలు, తీర్పుల ఉద్దేశ్యంపై సందేహాలు వ్యక్తం చేయడం వంటి అంశాలు కోర్టు దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సంబంధిత నేతలకు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు, ఎందుకు తమపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ చట్టం ప్రకారం న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం, న్యాయపరమైన ప్రక్రియలపై ప్రజల్లో అనుమానాలు కలిగించడం తీవ్రమైన అంశంగా పరిగణించబడుతుంది.

ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇప్పటివరకు అధికారికంగా పూర్తి స్థాయి స్పందన వెలువడకపోయినా, ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం, రాజకీయ విమర్శల హద్దులు, ప్రజాప్రతినిధుల బాధ్యత వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News