ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య దేశాధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ విషయంలో ప్రజల్లో దేశభక్తి ఉప్పొంగుతోందని ఆయన పేర్కొన్నారు.
దేశాన్ని కాపాడేందుకు ఇప్పటివరకు 1.4 కోట్లకు పైగా ఇరానీయులు తమ ప్రాణాలను అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని మసూద్ పెజెష్కియన్ తెలిపారు. ఇది ఇరాన్ ప్రజల ఐక్యత, దేశభక్తికి నిదర్శనమని ఆయన అన్నారు. దేశంపై ఎలాంటి ముప్పు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
తాను కూడా ఇరాన్ కోసం గతంలో త్యాగం చేసినవాడినని, ప్రస్తుతం కూడా అదే ధృఢసంకల్పంతో ఉన్నానని, భవిష్యత్తులో కూడా దేశ రక్షణ కోసం త్యాగానికి సిద్ధంగా ఉంటానని ఆయన ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ నాయకత్వం తమ ప్రజలకు ధైర్యం నూరిపోస్తోంది. దేశ భద్రతపై ఎలాంటి రాజీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
అంతర్జాతీయంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న వేళ, ఇరాన్ నాయకత్వం ప్రజల ఐక్యతను ప్రధానంగా చూపిస్తూ, దేశ రక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది.

