Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శభాష్ సువేందు: చికెన్ నెక్ ప్రాంతం కేంద్రానికి.

శభాష్ సువేందు: చికెన్ నెక్ ప్రాంతం కేంద్రానికి.

Satyam NEWS 5 days ago

శ్చిమ బెంగాల్ ప్రభుత్వం దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నది. బంగ్లాదేశ్ చొరబాటుదారులు పశ్చిమ బెంగాల్ లోనూ, ఈశాన్య రాష్ట్రాలలోనూ అక్రమంగా వచ్చేందుకు వీలుగా ఉన్న చికెన్ నెక్ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వానికి దఖలు పరుస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

భారతదేశ భౌగోళిక భద్రతలో అత్యంత కీలకంగా భావించే సిలిగురి కారిడార్‌ ప్రాంతానికి సంబంధించిన ఈ కీలక నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. "చికెన్ నెక్" పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ సన్నని భూభాగంలో సుమారు 120 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా సరిహద్దు భద్రతా దళం (BSF), ఇతర కేంద్ర భద్రతా సంస్థల అవసరాల కోసం బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించారు.

సిలిగురి కారిడార్‌ పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతం చుట్టూ విస్తరించి ఉండి, భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ఏకైక భూసంబంధ మార్గంగా వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ ప్రాంతం ఒక వైపు నేపాల్‌, మరో వైపు బంగ్లాదేశ్‌, ఉత్తరాన భూటాన్‌కు సమీపంలో ఉండటంతో భద్రతాపరంగా అత్యంత సున్నిత ప్రాంతంగా భావిస్తారు. ఈ కారిడార్‌ వెడల్పు కొన్ని చోట్ల కేవలం 20 నుండి 22 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉండటం వల్ల దీనిని "చికెన్ నెక్"గా పిలుస్తారు.

ఇటీవల బంగ్లాదేశ్-చైనా సంబంధాలు, సరిహద్దు భద్రతా పరిస్థితులు, వ్యూహాత్మక సవాళ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో భద్రతా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భూమి బదిలీ ప్రక్రియ చేపట్టినట్లు సమాచారం. కీలక జాతీయ రహదారులు, సైనిక రవాణా మార్గాలు, పర్యవేక్షణ కేంద్రాలు, భద్రతా స్థావరాల ఏర్పాటుకు ఈ భూమిని వినియోగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నిర్ణయం ద్వారా ఈశాన్య భారత రాష్ట్రాలకు వెళ్లే రహదారి, రైల్వే కనెక్టివిటీని రక్షించడంతో పాటు అత్యవసర సమయాల్లో సైనిక బలగాల వేగవంతమైన తరలింపుకు సౌకర్యం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిలిగురి కారిడార్‌ ప్రాంతంలో రహదారులు, రైల్వేలు, వైమానిక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ భూమి బదిలీ నిర్ణయం వ్యూహాత్మకంగా కీలకంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News