హీరోయిన్ కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యా రెడ్డి రిసెప్షన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రాండ్ డిజైన్, షైనింగ్ ఎంబ్రాయిడరీ ఉన్న లెహంగా చీరలో దర్శనమిచ్చిన కాజల్, తన భర్త గౌతమ్ కిచ్ల్యూతో కలిసి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
దీంతో కాజల్ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ రిసెప్షన్ కు మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, వి వి వినాయక్, బోయపాటి శ్రీను, దిల్ రాజు, గోపీచంద్ వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. రెండు రోజుల కిందట తిరుపతిలో బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం జరగగా, నిన్న హైదరాబాద్ లో రిసెప్షన్ ఘనంగా జరిగింది.

