మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కోడుమూరులో ఉపాధి కూలీలతో కరపత్రాలను విడుదల చేశారు.
ఏప్రిల్ 10 నుంచి 12 వరకు అనంతపురం నుండి బండపల్లి వరకు నిర్వహించనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన జి రామ్ జి చట్టం వల్ల ఉపాధి హామీ కూలీలకు జరుగుతున్న అన్యాయాన్ని వారు వివరించారు.

