రైతుల పక్షపాతి రేవంత్ సర్కార్ అని, కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ విజయరమణరావు అన్నారు. గురువారం ఎలిగేడు మండలం బురహాన్ నిమియాపేట, సుల్తాన్ పూర్, ముప్పిరితోట, ర్యాకలదేవుపల్లి గ్రామాల్లో సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులతో కలిసి ప్రారంభించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లపాటు రైతులు కొనుగోలు కేంద్రాలలో అష్ట కష్టాలు పడ్డారని, ఇప్పుడు అన్నదాతకు ఏ చిన్న ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని ఆయన తెలిపారు.

