మేడే సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మహా ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రంగారెడ్డి మాట్లాడుతూ, హక్కులు ఇచ్చేవి కాదని, పోరాడి సాధించుకోవాలని అన్నారు.
ప్రదర్శనలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి సలీం తదితరులు పాల్గొన్నారు. ఎర్ర చీరలు కట్టుకున్న మహిళలు కోలాటాలు వేసుకుంటూ ఉత్సాహంగా ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శన సీఐటీయూ కార్యాలయం నుండి సాగర్ ప్రధాని మీద కూడా రౌండ్ వరకు సాగింది.

