మైత్రి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ఫౌజీ' సినిమా షూటింగ్ కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది.
ఈ దుర్ఘటనలో ప్రొడక్షన్ యూనియన్ కు చెందిన ఒక వ్యక్తి మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో సినిమా షూటింగ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

