పేదలకు సొంతిల్లు ఆత్మగౌరవానికి నిదర్శనమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. మంగళవారం ఎలిగేడు మండలం ముప్పిరితోట, కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లిలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
అర్హత కలిగిన పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

